యుద్ధానికి దిగితే ఫలితం సరిహద్దులు దాటి వుంటుంది: పేట్రేగిన ఇమ్రాన్ ఖాన్

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (22:32 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన మాటలతో మరోసారి ఐకాస వేదికగా పేట్రేగిపోయారు. అణ్వాయుధాలను కలిగిన తమ దేశం యుద్ధానికి దిగితే ఫలితం సరిహద్దులను దాటి వుంటుందంటూ హెచ్చరికలు చేశారు. ఇదేదో వార్నింగ్ కాదంటూనే హెచ్చరిక లాంటిది చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఆయన ఆర్ఎస్ఎస్ సభ్యుడని అన్నారు.
 
ఆరెస్సెస్ అడల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పురుడు పోసుకున్నదంటూ చెప్పుకొచ్చారు. ముస్లింలను భారతదేశంలో లేకుండా చేయాలన్నదే ఈ సంస్థ లక్ష్యమనీ, ఆ ద్వేషంతోనే గాంధీజీని హత్య చేశారంటూ ఆరోపించారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం సాగుతోందనీ, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.
 
తాము కశ్మీరులోకి ఉగ్రవాదులను ఎందుకు పంపుతామంటూ ప్రశ్నించారు. ముస్లిం అంటేనే ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారనీ, హిందువులు కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో వున్నాయన్నారు. మరి వారిని మాత్రం అలా అనడం లేదని చెప్పారు. మొత్తమ్మీద కశ్మీర్ అంశాన్ని ఐకాస జోక్యం చేసుకోవాలన్న కోణంలో ఆయన ప్రసంగం సాగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments