ఐస్ క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలు.. చట్నీ, సాంబార్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:39 IST)
Idly ice cream
ఇడ్లీలంటే భారత దేశ ప్రజలకు మహా ప్రీతి. ఇడ్లీలలో వుండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇడ్లీల చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ ఇడ్లీలలోనే ప్రత్యేకత వుంది. ఈ ఇడ్లీలను ఐస్ క్రీమ్ స్టిక్‌లపై వడ్డించారు. అంతే ఫోటో వైరల్ అయ్యింది. 
 
బెంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ వంటకాన్ని పరిచయం చేశారు. ఐస్ క్రీమ్ స్టిక్‌పై ఇడ్లీ -సాంబార్ మరియు చట్నీ డిప్‌లు గల ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ 15,000 లైక్‌లను సంపాదించింది. ఇంకా 1,400 సార్లు రీట్వీట్ చేయబడింది. ఐస్‌క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలను అందించాలనే వినూత్న ఆలోచనను చూసి చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు, మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 
"పూర్తిగా వ్యతిరేకం ... ఒంటి చేత్తో ఇడ్లీ తినడం నిజమైన సంప్రదాయం ... ఇది అనారోగ్యం" అని ఒక వినియోగదారు రాశారు. "భారతీయ ఆహారాన్ని చేతులతో మాత్రమే తింటే మంచిది. మరేదైనా నేరమే" అని మరొకరు పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments