Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో ఎన్నికలా..? జగన్‌కు ఎలా తెలుసు? కుర్చీకాంక్ష అంటూ బాంబు పేల్చిన శివాజీ

సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:46 IST)
సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేలా బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకానుంది.
 
ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, తనకు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై శివాజీ స్పదించారు. జగన్‌కు ఏమన్నా పని ఉందా? అని మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా రాష్ట్రంలో కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ హెచ్చరించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని శివాజీ ప్రశ్నించారు. ఏదోవిధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడిన నేత చంద్రబాబు ఒక్కరేనని శివాజీ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments