Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో ఎన్నికలా..? జగన్‌కు ఎలా తెలుసు? కుర్చీకాంక్ష అంటూ బాంబు పేల్చిన శివాజీ

సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:46 IST)
సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేలా బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకానుంది.
 
ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, తనకు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై శివాజీ స్పదించారు. జగన్‌కు ఏమన్నా పని ఉందా? అని మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా రాష్ట్రంలో కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ హెచ్చరించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని శివాజీ ప్రశ్నించారు. ఏదోవిధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడిన నేత చంద్రబాబు ఒక్కరేనని శివాజీ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments