Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో ఎన్నికలా..? జగన్‌కు ఎలా తెలుసు? కుర్చీకాంక్ష అంటూ బాంబు పేల్చిన శివాజీ

సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:46 IST)
సినీ నటుడు శివాజీ మరో బాంబు పేల్చాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగబద్ధమైన సంస్థ సంస్థ (కోర్టు) నుంచి నోటీసులు వస్తాయని ఇటీవల ప్రకటించారు. ఆయన మాటలను రుజువు చేసేలా బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకానుంది.
 
ఈ నేపథ్యంలో శివాజీ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, మరో బాంబు పేల్చాడు. చంద్రబాబుకు మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ హితవు పలికారు. త్వరలో రెండో నోటీసులు రాబోతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
 
ఇకపోతే, తనకు పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై శివాజీ స్పదించారు. జగన్‌కు ఏమన్నా పని ఉందా? అని మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా? అని నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా రాష్ట్రంలో కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ హెచ్చరించారు. జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని శివాజీ ప్రశ్నించారు. ఏదోవిధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఎదురొడ్డి నిలబడిన నేత చంద్రబాబు ఒక్కరేనని శివాజీ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments