Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయాడు.. కొడుకు కాదన్నాడు.. కూతుళ్లు తల్లికి పెళ్లి చేశారు

తల్లికి కుమార్తెలు వివాహం చేసిపెట్టారు. భర్తలేని తల్లికి తోడు కల్పించారు. భర్త చనిపోయినా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు ఎదిగాక.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ త

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:12 IST)
తల్లికి కుమార్తెలు వివాహం చేసిపెట్టారు. భర్తలేని తల్లికి తోడు కల్పించారు. భర్త చనిపోయినా తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు ఎదిగాక.. కన్నతల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ తల్లికి కూతుళ్లు అండగా నిలిచారు. తన తల్లికి మరోసారి వివాహం చేసి కొత్త జీవితాన్ని అందజేశారు. ఈ సంఘటన మీరట్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని జాగృతి విహార్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోయి... 15 సంవత్సరాలైంది. అయినా  బిడ్డల కోసం బతికింది. తన కాయకష్టంతో పిల్లలను పెంచి పెద్ద చేసింది. కుమార్తెలకు ఘనంగా వివాహం జరిపించింది. 
 
అయితే కొడుకు చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిని కొడుతుండేవాడు. ఒకరోజు కన్నతల్లిని బయటకు గెంటేశాడు. దీంతో ఆమె కుమార్తెలే ఆమెకు ఆశ్రయం కల్పించారు. తర్వాత వారు తల్లికి మంచి వరుడిని వెదికి పెళ్లి చేశారు. సుహారన్‌పూర్ నివాసి, వారి బంధువు అయిన వ్యక్తితో తల్లికి వివాహం జరిపించారు. ఆయనకు పెళ్లయినప్పటికీ భార్య చనిపోవడంతో ఈ వివాహానికి అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments