Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క విమానంలో 640 మంది.. ఫొటో వైరల్‌

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (15:13 IST)
600 Afghans
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో.. అక్కడి ప్రజలు ప్రాణ భయంతో కాబూల్‌ విమానాశ్రయానికి పరుగులు తీశారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడ కనిపించిన ప్రతి విమానంలోకి ఎక్కారు. విమానాలు కాస్తా.. బస్సుల్ని తలపించాయి. 
 
ఆఖరికి విమానం రన్‌వేపై ల్యాండవుతుండగానే వందలాది మంది విమానంలోకి ఎక్కారు. వెళ్లలేనివాళ్లు.. విమానం టైర్లను పట్టుకొని కూర్చున్నారు. అలా విమానం పైకి ఎగరగానే ముగ్గురు కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విచారకర సంఘటన జరిగిన ఆ విమానంలో ఎంతమంది ఎక్కారో తెలుసా..?! ఏకంగా ఆ విమానంలో 640 మంది ఆఫ్ఘన్లు ఎక్కారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి-17 కార్గో విమానం. విమానంలో కిక్కిరిసి కూర్చున్న జనం ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
దీనిపై అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ.. 'అంతమందిని తీసుకెళ్లే ఉద్దేశం మాకు లేదు. అయినా ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో విమానంలోకి ఎక్కిన ఎవరినీ కిందకు దించలేదు. ఆ 640 మందిని ఖాతార్‌లో సురక్షితంగా దించాము' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments