Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న బ్యాంకు సిబ్బంది.. చెక్కులను కూడా ఇస్త్రీ చేస్తున్న ఉద్యోగి!

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (16:20 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ మహమ్మారిబారినపడకుండా ఉండేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ కేవలం నోటి తుంపర్ల ద్వారానే కాకుండా కరోనా సోకిన వ్యక్తి పట్టుకున్న వస్తువును తాకినాకూడా ఈ వైరస్ సోకుతుందని తేలింది. దీంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది అయితే మరింతగా భయపడుతున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడమే వారి భయానికి కారణంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ క్రమంలో తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ బ్యాంక్ అధికారి.. తనకు కరోనా సోకకూడదని ఏకంగా చెక్కులను ఇస్త్రీలు చేసేస్తూ కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
 
సదరు అధికారి.. కస్టమర్ తెచ్చిన చెక్కును పట్టకారాతో అందుకున్నారు. ఆ తర్వాత దాన్ని టేబుల్‌పై ఉంచి ఇస్త్రీ చేశారు. చేతులకు గౌవ్స్ ధరించి ఆయన ఇవ్వన్నీ చేశారు. కాగా.. ఈ వీడియోపై స్పందించిన ఆనంద్ మహింద్రా.. బ్యాంకు అధికారి సృజనాత్మకతను మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments