గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:41 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారి తీసింది. 60కి పైగా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 16 మంది ఆచూకీ లభించలేదు. అయితే బోటు డ్రైవర్లు ఆచూకీ కూడా లభించలేదు.
 
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణలు చనిపోలేదనీ, వారు బతికే ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదాన్ని ముందే ఈ బోటు డ్రైవర్లు గమనించారని తెలుస్తోంది. అందుకే బోటు ప్రమాదానికి పది నిమిషాల ముందే వీరు కిందకు దూకేశారని బోటులో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. 
 
పడవ నడపడంలోను, ఈత కొట్టడంలోను వీరిద్దరూ నిష్ణాతులు. అలాంటివారు చనిపోయే అవకాశాలు తక్కువని.. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి తామే కారణమని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇద్దరు బోటు డ్రైవర్లు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు బోటు డ్రైవర్ల కుటుంబ సభ్యుల కాల్ డేటాను వెతికే పనిలో పడ్డారు. మరి నిజంగా ఈ డ్రైవర్లు బతికే వున్నారా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుమారులు లింగ, యాత్ర కలిసి తిరుపతిలో మొక్కు చెల్లించుకున్న ధనుష్

Vijay Sethupathi: మాట‌ల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శ‌బ్దం గాంధీ టాక్స్‌ ట్రైల‌ర్

Rani Mukerji: రాణీ ముఖ‌ర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగ‌సీని సెల‌బ్రేషన్స్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ నుంచి కాలమే తన్నెరా లక్ ని ఆమడ దూరం.. సాంగ్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

తర్వాతి కథనం
Show comments