Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:41 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారి తీసింది. 60కి పైగా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 16 మంది ఆచూకీ లభించలేదు. అయితే బోటు డ్రైవర్లు ఆచూకీ కూడా లభించలేదు.
 
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణలు చనిపోలేదనీ, వారు బతికే ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదాన్ని ముందే ఈ బోటు డ్రైవర్లు గమనించారని తెలుస్తోంది. అందుకే బోటు ప్రమాదానికి పది నిమిషాల ముందే వీరు కిందకు దూకేశారని బోటులో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. 
 
పడవ నడపడంలోను, ఈత కొట్టడంలోను వీరిద్దరూ నిష్ణాతులు. అలాంటివారు చనిపోయే అవకాశాలు తక్కువని.. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి తామే కారణమని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇద్దరు బోటు డ్రైవర్లు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు బోటు డ్రైవర్ల కుటుంబ సభ్యుల కాల్ డేటాను వెతికే పనిలో పడ్డారు. మరి నిజంగా ఈ డ్రైవర్లు బతికే వున్నారా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments