గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (18:41 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారి తీసింది. 60కి పైగా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికీ 16 మంది ఆచూకీ లభించలేదు. అయితే బోటు డ్రైవర్లు ఆచూకీ కూడా లభించలేదు.
 
బోటు డ్రైవర్లు నూకరాజు, సత్యనారాయణలు చనిపోలేదనీ, వారు బతికే ఉన్నారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదాన్ని ముందే ఈ బోటు డ్రైవర్లు గమనించారని తెలుస్తోంది. అందుకే బోటు ప్రమాదానికి పది నిమిషాల ముందే వీరు కిందకు దూకేశారని బోటులో ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. 
 
పడవ నడపడంలోను, ఈత కొట్టడంలోను వీరిద్దరూ నిష్ణాతులు. అలాంటివారు చనిపోయే అవకాశాలు తక్కువని.. ఇంతటి పెద్ద ప్రమాదం జరగడానికి తామే కారణమని తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో ఇద్దరు బోటు డ్రైవర్లు కనిపించకుండా తిరుగుతున్నారని తెలుస్తోంది. దీంతో పోలీసులు బోటు డ్రైవర్ల కుటుంబ సభ్యుల కాల్ డేటాను వెతికే పనిలో పడ్డారు. మరి నిజంగా ఈ డ్రైవర్లు బతికే వున్నారా లేదా అనేది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments