గీత గోవిందం... ఆ సీన్ లీక్.. కారణం ఎవరంటే..?

స్టార్ హీరోల సినిమాలకు లీకుల గోల తప్పట్లేదు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత సీన్లు లీక్ కావడంతో ఆ సినిమా యూనిట్ తలపట్టుకుంది. తాజాగా గీత గోవిందం సినిమాకు కూడా ఇక్కట్లు తప్పలేదు. అ

Webdunia
ఆదివారం, 12 ఆగస్టు 2018 (11:16 IST)
స్టార్ హీరోల సినిమాలకు లీకుల గోల తప్పట్లేదు. నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత సీన్లు లీక్ కావడంతో ఆ సినిమా యూనిట్ తలపట్టుకుంది. తాజాగా గీత గోవిందం సినిమాకు కూడా ఇక్కట్లు తప్పలేదు.


అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ''గీత గోవిదం'' సినిమా పైరసీ వ్యవహారంలో ఇంజనీరింగ్ విద్యార్థులున్నట్లు తెలియరావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లీకైన సీన్లలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య గల లిప్ లాక్ సీన్ కూడా వుండటంతో అమాంతం వైరల్ అవుతోంది. 
 
ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా గీత గోవిందం చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు దర్శనమివ్వడంతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.
 
స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చేపట్టిన విచారణలో గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు సినిమా సీన్లను షేర్ చేసుకున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. హైదరాబాద్‌లో సినిమా ఎడిటింగ్ సమయంలో ఓ వ్యక్తి వీటిని అక్రమంగా కాపీ చేసినట్లు తేలిందని పోలీస్ అధికారి చెప్పారు. 
 
సోషల్ మీడియాలో ఈ సీన్లు షేర్ కావడంతో వైరల్ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు 10 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments