Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత జీవిత కథ ఆధారంగా ధారావాహిక.. అమ్మ పాత్రలో రమ్యకృష్ణ

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:37 IST)
దివంగత అన్నాడీఎంకే నేత జయలలిత జీవిత కథ ఆధారంగా బయోపిక్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్య మలుపులు వున్నాయి. అలాంటి ఆమె జీవితచరిత్రను ఆవిష్కరించడానికి తమిళ దర్శకులు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఒకవైపున దర్శకురాలు ప్రియదర్శిని.. మరోవైపు భారతీరాజా ఆ ప్రయత్నాల్లో వున్నారు. 
 
ఈ నేపథ్యంలో జయలలిత జీవిత చరిత్రను ధారావాహికగా తీసేందుకు గౌతమ్ మీనన్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ధారావాహికకు ఆయనే దర్శకత్వం వహిస్తాడా లేకుంటే నిర్మాతగా మాత్రమే వుంటాడా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. జయలలిత జీవిత కథ ఆధారంగా తీయనున్న ధారావాహికను 30 ఎపిసోడ్స్‌గా తెరకెక్కించనున్నారు. 
 
జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణ పాత్రను తీసుకోనున్నారని తెలిసింది. టీవీలో ప్రసారమయ్యే ఈ ధారావాహిక.. వెబ్ సిరీస్ రూపంలో అందుబాటులో వుంటుందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ధారావాహికలో రంజిత్, వినిత ఎంజీర్, శశికళ పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments