ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రాబాబుపై కుంటిసాకులు : ఎంపీ కవిత

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:24 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి చంద్రబాబే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
నిన్నామొన్నటివరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇపుడు చంద్రబాబు ప్రచారం వల్లే ఓడిపోయామని అంటున్నారని, కూటమి ఓటమి పట్ల ఆయన తప్పేమీ లేదన్నారు. ఓటమికి గల అసలు కారణాలను టీ కాంగ్రెస్ నేతలు గ్రహించలేక పోతున్నారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు మొదటి నుంచి తెరాస వెంటే ఉన్నారని, ఈ విషయం తమకు తెలుసునని, చంద్రబాబు వచ్చినా, మరెవరు వచ్చినా ప్రజల మనసుల నుంచి కేసీఆర్‌ను తొలగించలేకపోయారన్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న కారణంగానే తెరాసకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments