Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రాబాబుపై కుంటిసాకులు : ఎంపీ కవిత

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:24 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఎదురైన ఓటమికి చంద్రబాబే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
నిన్నామొన్నటివరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇపుడు చంద్రబాబు ప్రచారం వల్లే ఓడిపోయామని అంటున్నారని, కూటమి ఓటమి పట్ల ఆయన తప్పేమీ లేదన్నారు. ఓటమికి గల అసలు కారణాలను టీ కాంగ్రెస్ నేతలు గ్రహించలేక పోతున్నారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు మొదటి నుంచి తెరాస వెంటే ఉన్నారని, ఈ విషయం తమకు తెలుసునని, చంద్రబాబు వచ్చినా, మరెవరు వచ్చినా ప్రజల మనసుల నుంచి కేసీఆర్‌ను తొలగించలేకపోయారన్నారు. కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న కారణంగానే తెరాసకు మరోమారు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments