Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు అరిచి గీపెట్టినా మేము చేయాల్సింది చేస్తాం...

పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:07 IST)
పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో అన్నారు. అంతేకాకుండా, టీడీపీ, వైకాపాలు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారట.
 
పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీతో కొత్తపల్లి గీత కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్‌కు మేం మేలు చేయాలనే ఉన్నాం. కానీ... టీడీపీ, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయి. చేసుకోనివ్వండి. ఎవరు ఎలా వ్యవహరించినా మేము మాత్రం ఏపీకి న్యాయం చేస్తాం. రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా పరిశీలిస్తున్నాం' అని వ్యాఖ్యానించారని గీత చెప్పుకొచ్చారు.
 
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగువేసేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments