Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చికిత్సకు తొలి టాబ్లెట్... యూకె మెడిసిన్స్ ఆమోందం

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (19:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓ టాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔష‌ధ త‌యారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. 
 
మాల్నుపిరావిర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ మాత్ర కొవిడ్ చికిత్సకు బాగా ప‌నిచేస్తుంద‌ని మెర్క్ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. కొవిడ్ తీవ్ర‌త అధికంగా ఉన్న వారికి ఈ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు ఇస్తే మంచి ఫలితం ఉంటుంద‌ని చెప్పారు.
 
వాస్తవానికి ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్.. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది. చావు లేదా హాస్పిట‌లైజేష‌న్ రిస్క్‌ను 50 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని తేలింది. 
 
ఈ టాబ్లెట్ వినియోగానికి యూకే మెడిసిన్స్ రెగ్యులేట‌రీ ఆమోదం తెలిపింది. దాంతో ప్ర‌పంచంలో కొవిడ్ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments