Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గవర్నర్ అప్రమత్తంగా లేకుంటే.. ఆయన్ను తాకట్టు పెట్టేస్తారు

Advertiesment
గవర్నర్ అప్రమత్తంగా లేకుంటే.. ఆయన్ను తాకట్టు పెట్టేస్తారు
విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (16:52 IST)
ఏపీ గవర్నర్ అప్రమత్తంగా ఉండకపోతే, ఆయనను.. ఆయన ఉండే ఇంటిని కూడా కూడా తాకట్టు పెట్టేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా చూడాలని మనవి చేశారు. ఇటీవ‌ల రాష్ట్ర అప్పుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ పేరును ఒప్పందాల్లో ప్ర‌స్తావించ‌డంపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ రెడ్డి స‌మ‌ర్ధించ‌డాన్ని ఆయ‌న ఖండించారు.
 
 
విశాఖ‌ప‌ట్నం రుషికొండలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్‌కి సమయం లేదని విమర్శించారు. ఇది చాలా అన్యాయమని... హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీటీడీ ఆలయాన్ని పదిరోజుల్లో ప్రారంభించాలని... లేకపోతే నిరసన చేపడతామన్నారు. రుషికొండలో పర్యావరణాన్ని తూట్లు పొడిచి నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య‌వాడ‌లో యు.జి.డి పనులకు శంకుస్థాపన చేసిన మేయ‌ర్