Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం.. ఏది అబద్ధం : డిసెంబర్ 1 నుంచి మళ్లీ లాక్డౌన్

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (08:21 IST)
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ లాక్డౌన్ అమలు చేసింది. ఇది మార్చి మూడో వారం నుంచి రెండు నెలల పాటు కఠినంగా కొనసాగింది. ఆ తర్వాత దశలవారీగా ఈ లాక్డౌన్‌ను సడలిస్తూ వచ్చింది. అయినప్పటికీ దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్దగా తగ్గలేదు. ఇప్పటికీ రోజుకు 45 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, డిసెంబరు ఒకటో తేదీ నుంచి మళ్లీ లాక్డౌన్ అమలు చేయబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయివుంది. ట్విటర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. 
 
అయినప్పటికీ.. ఈ వార్తలపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) దీనిపై స్పందించింది. ప్రముఖ మీడియా సంస్థ పేరుతో మార్ఫింగ్‌ చేసిన ఒక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని, అయితే లాక్డౌన్‌ పెట్టే ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదని పీఐబీ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments