Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుముకొస్తున్న "ఎక్స్ఈ'' ముప్పు... మాస్కులు తీయొద్దంటూ హెచ్చరిక

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (09:04 IST)
కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతుందని సంబరపడుతున్న వేళ మరో ముప్పు పొంచివుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్‌లోని మరో వేరియంట్ అయిన "ఎక్స్ఈ" నుంచి ముప్పు పొంచివుందని, ఇంది ప్రజలను మరింత భయపెడుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ "ఎక్స్ఈ" వైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్. "బీఏ.1, బీఏ.2"ల మిశ్రమ వేరియంట్‌గా వెల్లడించారు. ఇది బీఏ.2 కంటే 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగంపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరిస్తున్నారు. 
 
మాస్కులు తీసే సమయం ముందు ఉందని, ఇప్పటికైతే వాటిని ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేసమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా "ఎక్స్ఈ" వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పురుడు పోసుకున్న చైనాలో రోజువారీగా నమోదయ్యే కేసులు సరికొత్త రికార్డును నెలకొల్పుతున్నాయి. అందువల్ల భారత్‌లోనూ మళ్లీ అది విజృంభించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, అందువల్ల కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించనంతవరకు కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు ఆయా ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments