కన్నీళ్లు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (10:29 IST)
Hyderabadi NRI
సాధారణంగా వివాహం అంటేనే వరుడు ఎగిరి గంతేస్తాడు. కానీ ఇక్కడ ఓ వరుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే తన పెళ్లికి నాన్న హాజరు కాలేదని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సంఘటన జెడ్డాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్దాద్ అలీ జెడ్డాలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.
 
అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జరపాలని జెడ్డాలోనే నిర్ణయించారు. ఎందుకంటే అలీ బంధువులు దాదాపు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి. అంతలోనే కరోనా లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి వాయిదా పడింది. అలీ తల్లిదండ్రులు జెడ్డా వెళ్లలేకపోయారు. 
 
ఇప్పటికీ కూడా వారికి వీసా రాలేదు. దీంతో పెళ్లి ఆలస్యమవుతుందని భావించి ఇరు కుటుంబాల పెద్దలు లేకుండానే నిఖా జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వరుడు తల్లిదండ్రులు లేకుండానే అలీ నిఖా జరిపించారు. ఈ సమయంలో తండ్రిని గుర్తు చేసుకుని అలీ భావోద్వేగానికి లోనయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments