Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా: అలసిపోయిన గజరాజులు.. గాఢనిద్ర ఫోటోలు వైరల్

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (18:50 IST)
Elephant
చైనాలో జరిగిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. చైనాలో తిరగాడిన గజరాజులు బాగా అలసిపోయి ఆదమరచి గాఢనిద్రలో వున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు ట్రెండింగ్‌లో నిలిచాయి. 
 
జూన్ మూడో తేదీ నైరుతి చైనాలోని, యునాన్ ప్రావిన్స్‌లోకి దాదాపు 15 ఏనుగులు గుంపుగా .. జనవాసాల్లోకి వచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఆహారం కోసం జనవాసాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆహారం కోసం 500 కిలోమీటర్లు నడక సాగించాయి. అయితే ప్రజలకు ఈ ఏనుగులు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. 
 
వీటిని చూసిన అధికారులు అడవుల్లోకి ఏనుగులను తరలించే పనిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఛానెల్‌లో ఏనుగుల గుంపును అడవికి పంపే దృశ్యాలను లైవ్‌గా ప్రసారం చేసింది.
Elephant
 
అడవిలోకి వెళ్లే క్రమంలో 15 ఏనుగులు.. అలసిపోయి.. గాఢంగా నిద్రపోయాయి. ఆ గుంపులో పెద్ద ఏనుగులు నిద్రిస్తుంటే ఓ గున్న ఏనుగు ఆడుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments