Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకబిగిన 50 కోడుగుడ్లు తినేస్తా, కాస్కో నా దెబ్బ అన్నాడు, 42వ గుడ్డుకే గుండె ఆగిపోయింది

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:22 IST)
పల్లెటూర్లలో ఇప్పటికీ పందేలు జరుగుతుంటాయి. మోయలేనంత బండలు పైకెత్తడం, ఒకేసారి వరసబెట్టి అరటిపళ్లు తినడం వంటివి ఎన్నో పందేలు వీటిలో వుంటుంటాయి. ఒక్కోసారి ఈ పందేలు ప్రాణాలను తీస్తుంటాయి. అలాంటిదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔనాపూరులో చోటుచేసుకుంది.
 
50 కోడిగుడ్లను ఏకబిగిన తింటే 2 వేల రూపాయల బహుమానం అంటూ గ్రామంలో పందెం వేశారు. దీనితో సుభాష్ యాదవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి పందెంలో దిగాడు. 50 కోడిగుడ్లను ఏమాత్రం గ్యాప్ లేకుండా తినేస్తానని సవాల్ విసిరాడు.
 
ఇంకేముంది.. అతడి స్నేహితులు 50 కోడిగుడ్లను తెచ్చి ముందుపెట్టారు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కోడిగుడ్లను చెకచెకా తినేస్తుండటంతో చూస్తున్నవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అయితే 42వ కోడిగుడ్డు తింటూ ఒక్కసారి కుప్పకూలి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
 
పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. దీనికి కారణం... అతడు మోతాదుకు మించి కోడిగుడ్లను తినడమేనని తేల్చారు. రోజుకి రెండు కోడిగుడ్లకు మించి తింటే గుండెపనితీరుపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. భారీగా కోడిగుడ్లు తినడంతో గుడ్డు పచ్చసొన గుండెపై ప్రతికూల ప్రభావం చూపిందనీ, దీనితో అతడు ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్థారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments