Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Ghaziabadలో ఘోరం.. శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు (video)

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:03 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోనూ పరిస్థితులు భయంకరంగా వున్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చికిత్సకు బెడ్స్ కూడా దొరకడం లేదు. చివరకు కరోనా మృతులతో శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. 
 
తాజాగా ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు పడివున్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
 
కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దహన సంస్కారాలపైనా ఆంక్షలు విధించారు. శ్మశాన వాటికలో ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే దహన సంస్కారాలు ఆలస్యమవుతున్నాయి. 
 
మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. ఆ మృతదేహాలతో శ్మశాన వాటిక ముందు బంధువులు పడిగాపులు గాస్తున్నారు. హిండన్ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో క్యూకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ షాకింగ్ దృశ్యాలను నెటిజన్లు చలించిపోతున్నారు. మన దేశానికి ఏంటీ దుస్థితి అని బాధపడుతున్నారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments