Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Ghaziabadలో ఘోరం.. శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు (video)

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:03 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దేశంలోనూ పరిస్థితులు భయంకరంగా వున్నాయి. కోవిడ్ రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. చికిత్సకు బెడ్స్ కూడా దొరకడం లేదు. చివరకు కరోనా మృతులతో శ్మశాన వాటికలు కూడా నిండిపోతున్నాయి. 
 
తాజాగా ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో మృతదేహాలు పేరుకుపోతున్నాయి. హండన్ శ్మశాన వాటిక ముందు వందల సంఖ్యలో మృతదేహాలు పడివున్నాయి. అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
 
కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దహన సంస్కారాలపైనా ఆంక్షలు విధించారు. శ్మశాన వాటికలో ఒకసారి ఐదు మృతదేహాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే దహన సంస్కారాలు ఆలస్యమవుతున్నాయి. 
 
మరోవైపు కోవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో.. ఆ మృతదేహాలతో శ్మశాన వాటిక ముందు బంధువులు పడిగాపులు గాస్తున్నారు. హిండన్ శ్మశాన వాటిక వెలుపల మృతదేహాలతో క్యూకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ షాకింగ్ దృశ్యాలను నెటిజన్లు చలించిపోతున్నారు. మన దేశానికి ఏంటీ దుస్థితి అని బాధపడుతున్నారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. అందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments