Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 40 వేల పిడుగులు... 39 మంది మృతి: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్... 27 మంది మృతి

పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ

Webdunia
గురువారం, 3 మే 2018 (11:44 IST)
పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ పరిస్థితి ఎంత గందరగోళంగా వున్నదో అర్థమవుతుంది. ఈ భయానక పిడుగులు కారణంగా రాష్ట్రంలో 39 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 14 మంది చనిపోయారు. 
 
గతంలో ఎప్పుడూ చోటుచేసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుల దాడి ఎక్కువైంది. మేఘాలు పట్టాయంటే జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సహజంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మొదటి వారంలో వేసవి తీవ్రత ఎక్కువగా వుంటుంది. ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా వుంటాయి. సముద్రం పైనుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశం మేఘావృతమవుతుంది. వీటిని క్యుములోనింబస్ మేఘాలంటారు. ఇవి వర్షించడం మొదలుపెడితే పిడుగల వాన కురుస్తుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలవగా 27 మంది మృత్యువాత పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments