Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 40 వేల పిడుగులు... 39 మంది మృతి: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్... 27 మంది మృతి

పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ

Webdunia
గురువారం, 3 మే 2018 (11:44 IST)
పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ పరిస్థితి ఎంత గందరగోళంగా వున్నదో అర్థమవుతుంది. ఈ భయానక పిడుగులు కారణంగా రాష్ట్రంలో 39 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 14 మంది చనిపోయారు. 
 
గతంలో ఎప్పుడూ చోటుచేసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుల దాడి ఎక్కువైంది. మేఘాలు పట్టాయంటే జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సహజంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మొదటి వారంలో వేసవి తీవ్రత ఎక్కువగా వుంటుంది. ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా వుంటాయి. సముద్రం పైనుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశం మేఘావృతమవుతుంది. వీటిని క్యుములోనింబస్ మేఘాలంటారు. ఇవి వర్షించడం మొదలుపెడితే పిడుగల వాన కురుస్తుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలవగా 27 మంది మృత్యువాత పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments