Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ మందు బాబులు రూ.602 కోట్ల మద్యం తాగేశారు...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (10:29 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయి. కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా 602 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని మద్యం బాబులు తాగేశారు. గత యేడాది విక్రయాలతో పోల్చుకుంటే ఇది 34 శాతం అధికం కావడం గమనార్హం. అలాగే, చెన్నై మహానగరంలో నాలుగు రోజుల్లో ఏకంగా రూ.175 కోట్లకు మద్యం విక్రయాలు జరిగాయి. గత యేడాదితో పోల్చితే ఇది 20 శాతం అధికం. 
 
సాధారణంగా పండుగ సీజన్‌లలో మద్యం విక్రయాలు జోరుగానే సాగుతుంటాయి. ఆ విధంగా ఈ యేడాది మద్యం విక్రయాలకు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అన్ని మద్యం దుకాణాల్లో భారీగా మద్యం నిల్వలు ఉంచారు. 
 
ఈ నేపథ్యంలో దీపావళి పండుగ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా రూ.602 కోట్లకు విక్రయాలు జరిగాయి. ఒక్క చెన్నై నగరంలో జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, గత శనివారం రోజున రూ.124 కోట్లకు విక్రయాలు జరిగాయి. అలాగే, గత ఆదివారం రూ.150 కోట్లు, సోమవారం రూ.148 కోట్లు, దీపావళి పండుగ రోజున రూ.180 కోట్లకు చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. 
 
నిజానికి ఈ దీపావళికి టపాకాయల విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే, ఇతర వస్తు సామాగ్రి విక్రయాలు కూడా గణనీయంగా తగ్గాయి. కానీ, మద్యం విక్రయాలు మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 35 శాతం మేరకు పెరగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments