Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వ్యాధిగా మారిన డెంగీ... వ్యాక్సిన్ కావాలంటున్న సైంటిస్టులు

Webdunia
మంగళవారం, 2 మే 2023 (11:05 IST)
డెంగీ వైరస్ తన రూపు మార్చుకుంటుంది. దీంతో ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈ వ్యాధి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు కోరుతున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. 
 
భారత్‌లోని డెంగీ వైరస్ కొత్త రూపు దాల్చినట్టు పేర్కొంది. దీన్ని కట్టడి చేయాలంటే తక్షణం ఒక వ్యాక్సిన్ అవసరమని తెలిపింది. గత ఆరు దశాబ్దాలుగా దేశంలో నమోదైన డెంగీ డేటాను విశ్లేషించి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
 
ఈ అధ్యయనంలో పలు సంస్థలు పాలుపంచుకున్నాయి. డెంగీ కేసులు గత 50 యేళ్లుగా నిలకడగా పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా సైంటిస్టులు డెంగీ వైరస్‌కు చెందిన నాలుగు సీరోటైప్‌లపై అధ్యయనం చేశారు. తమ పూర్వ వేరియంట్లతో పోల్చతే ఈ సీరోటైప్‌లు ఎంత మేర రూపాంతరం చెందుతాయన్నది పరిశోధించారు. ఈ పరిశోధన వివరాలను ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. 
 
ఐఐఎస్‌సీ పరిశోధకులు భారతీయ డెంగీ స్ట్రెయిన్‌ల నుంచి 408 జెనెటిక్ సీక్వెన్స్‌లను పరిశీలించారు. ఈ సీక్వెన్స్‌లు 1956 నుంచి 2018 మధ్య కాలంలో సేకరించారు. ప్రస్తుతం కొత్తగా రూపాంతరం చెందిన డెంగీ వైరస్‌ను అడ్డుకునేందుకు అర్జెంటుగా వ్యాక్సిన్ కావాలని సైంటిస్టులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments