Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిపై తీవ్రమైన కసి... తెదేపాలో చేరిన 30 రోజుల్లోనే ఆయన బాపట్ల ఎంపి అయ్యారు

ఐవీఆర్
గురువారం, 6 జూన్ 2024 (13:11 IST)
ఎన్నికల్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అదికూడా లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడుగా విజయం సాధించాలంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. ఏడెనిమిది నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరినీ ప్రసన్నం చేసుకోవాలి. కనీసం రెండుమూడేళ్ల పాటు ప్రజల్లో తిరుగుతూ, వారి బాగోగులు చూస్తూ వుంటేనే విజయం సాధ్యమవుతుంది. అలాంటిది కేవలం 30 రోజుల వ్యవధిలో తెదెపాలో చేరి ఎంపీ అయ్యారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, బాపట్ల తెదేపా ఎంపిగా బరిలో దిగి 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థిని మట్టికరిపించారు ఆయన. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్.
 
తెలంగాణ భాజపా అధికార ప్రతినిధిగా పనిచేసారు. అక్కడ భాజపా నుంచి టిక్కెట్ రాకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఆయన అత్తగారు గతంలో తెదేపా హయాంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర వుండటంతో బాపట్ల నుంచి ఆయనకు అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు. బాపట్ల నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరన్న సంగతి కూడా పెద్దగా తెలియదు కానీ వైసిపి పైన వున్న తీవ్రమైన వ్యతిరేకత వల్ల ప్రజలంతా సైకిల్ పైన గుద్దేశారు.

అంతే కృష్ణ ప్రసాద్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఇలాంటివారు కూడా తమను ఓడించడంపై వైసిపి అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమపై ప్రజలకు ఇంతమేర కసి వున్నదా అని షాక్ తింటున్నారు. కారణాలు ఏమిటన్నది అంతర్మథనం చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments