Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేటస్‌కు తగినట్టుగా మాస్క్ : ధర జస్ట్ రూ.11.2 కోట్లు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:30 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ముఖానికి తప్పనిసరిగా ధరిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖానికి మాస్క్ ధరించేలా నిర్బంధ ఆదేశాలు జారీచేశాయి. దీంతో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మాస్కులు ధరిస్తున్నారు. ముఖ్యంగా, డబ్బున్నవారు తమ స్థాయికి తగినట్టుగా ఖరీదైన మాస్కులు ధరిస్తుంటే.. పేదలు, మధ్యతరగతి వారు మాత్రం సాధారణ మాస్కులు ధరిస్తూ ఈ కరోనా మహమ్మారిబారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు. టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్‌ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు. 
 
జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments