Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేటస్‌కు తగినట్టుగా మాస్క్ : ధర జస్ట్ రూ.11.2 కోట్లు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:30 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇపుడు ప్రతి ఒక్కరూ ముఖానికి తప్పనిసరిగా ధరిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముఖానికి మాస్క్ ధరించేలా నిర్బంధ ఆదేశాలు జారీచేశాయి. దీంతో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిస్తున్నారు. అయితే, ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మాస్కులు ధరిస్తున్నారు. ముఖ్యంగా, డబ్బున్నవారు తమ స్థాయికి తగినట్టుగా ఖరీదైన మాస్కులు ధరిస్తుంటే.. పేదలు, మధ్యతరగతి వారు మాత్రం సాధారణ మాస్కులు ధరిస్తూ ఈ కరోనా మహమ్మారిబారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు. టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్‌ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు. 
 
జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments