Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు : సీఎం కుమార స్వామి

తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదనీ, అదేసమయంలో డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. అందువల్ల మహాత్మాగాంధీ చూపిన మార్గదర్శకత్వంలో పాలన సాగించి పేద కుటుంబా

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (08:50 IST)
తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలియదనీ, అదేసమయంలో డబ్బు సంపాదించాలనే ఆసక్తి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. అందువల్ల మహాత్మాగాంధీ చూపిన మార్గదర్శకత్వంలో పాలన సాగించి పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పారు.
 
సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి సోమవారం కుమారకృప రోడ్డులోని గాంధీభవన్‌ను సందర్శించారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు తాను గనుక సిద్ధమైతే తనను ముఖ్యమంత్రి స్థానం నుంచే తప్పించే వ్యవస్థ ఏర్పడిందన్నారు. 
 
సమాజంలో పాతుకుపోయిన అవినీతి నిర్మూలన పూర్తిస్థాయిలో సాధ్యం కాదన్నారు. ఎందుకంటే తనకు పూర్తి స్థాయి మెజారిటీ లేనందున కఠినమైన నిర్ణయాలు తీసుకోలేనన్నారు. రెండు మూడ్రోజుల్లో అధికారులతో సమావేశమై.. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. 
 
అలాగే, ప్రభుత్వం నుంచి తమ మఠానికి ఏమీ చేయకపోయినా ఫర్వాలేదని, సమాజంలో అవినీతిని నిర్మూలించాలని శృంగేరి మఠాధిపతి తనకు సూచించారనీ, ఆయన సూచనను తు.చ తప్పకుండా ఆచరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments