Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకి పెరటివైద్యం, ముక్కులో నిమ్మరసం పిండుకున్నాడు, మృతి చెందాడు

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:51 IST)
కరోనావైరస్ తీవ్రం కావడంతో ప్రతి ఒక్కరు భయంతో వుంటున్నారు. కరోనా రాకుండా వుండేందుకు గతంలో ఎందరో చెక్క, లవంగాలు, అల్లం తదితర వంటింటి దినుసులు వేసి కషాయాలు కాచుకుని తాగడంతో కొందరు కాలేయ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఉదంతాలు వెలుగుచూసాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.
 
నిమ్మకాయకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని నమ్మిన ఓ ఉపాధ్యాయుడు ఏకంగా నిమ్మకాయ రసాన్ని ముక్కు రంధ్రాల్లో పిండాడు. అలా పిండటం ద్వారా నిమ్మరసం నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి కరోనాను రాకుండా అడ్డుకుంటుందని అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అతడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఉపాధ్యాయుడు రాయచూరు జిల్లాకి చెందినవారు కాగా ఆయన వయసు 43 ఏళ్లు.
 
ఈ విషాద ఘటనపై వైద్యులు స్పందిస్తూ ఇలాంటి వైద్యాలు ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయనీ, వైద్యుల సూచనల మేరకే ఏదైనా ఆచరించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments