Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంటలో దిగిన చైనీయులను చూసి పారిపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం కూడా...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (20:04 IST)
కరోనా వైరెస్ దెబ్బకు చైనా దేశస్తులను చూస్తే ప్రతి ఒక్కరూ జడుసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయంలో చైనా నుంచి తమ పని నిమిత్తం పలువురు చైనీయులు విమానం ద్వారా చేరుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని చూసిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను తీసుకుని పారిపోయారు. ఎక్కడ తమ వాహనాలను ఎక్కుతారోనని భయపడిపోయారు. 
 
దాంతో చైనా దేశస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లను బ్రతిమాలి ఎలాగైనా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు చైనీయులు తంటాలు పడ్డారు. జనంతో మాట్లాడేందుకు ముందుకు వెళ్లిన చైనీయులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు కూడా వారిని చూసి పరుగులు పెట్టడం గమనార్హం.
 
విషయం తెలుసుకున్న పోలీసులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బెంగళూరు నుంచి మొత్తం 15 మంది రేణిగుంటకు వచ్చినట్లు తెలుసుకుని వారికి కరోనా వైరస్ వున్నదో లేదో చెక్ చేసారు. ఆ తనిఖీలో వారికి కరోనా సంబంధ సమస్య ఏమీ లేదని తేలడంతో వారిని తమ గమ్య స్థానాలకు తీసుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments