శాంతించు కరోనా దేవీ, కరోనాకు ఆలయం, నిత్యార్చన, యాగాలు (video)

Webdunia
సోమవారం, 24 మే 2021 (20:15 IST)
కరోనాకు ఆలయమేంటని విచిత్రంగా అనుకోవచ్చు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే ఆలయాన్ని కట్టి ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఎప్పుడూ వెరైటీగా ఉండే తమిళ ప్రజలు ఈసారి ఏకంగా కరోనాకు ఆలయం కట్టారు. కరోనా దేవిగా నామకరణం చేసేశారు.
 
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరంలోనే కరోనా దేవి ఆలయం కట్టేశారు. విగ్రహం పెట్టారు. ఇద్దరు అర్చకులను నియమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా నిత్యార్చనలు, పూజలు చేసేస్తున్నారు. కరోనా దేవికి శాంతిపూజలు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు. 
 
కరోనా విజృంభణ తగ్గించు.. శాంతించూ అంటూ మంత్రాలు కూడా చదువుతున్నారట. కోయంబత్తూరులో పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానికులే ఆలయాన్ని కట్టించాలని నిర్ణయించుకున్నారట. విరాళాలను స్థానికులే సేకరించి ఆలయాన్ని కట్టేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోయంబత్తూరులో కరోనాకు ఆలయం కట్టడంపై పెద్ద చర్చే జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

తర్వాతి కథనం
Show comments