కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:10 IST)
mizoram
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక సోషల్ మీడియాలో ముందుంటారు. తాజాగా, ఆయన తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసిన ఒక అద్భుతమైన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. దట్టమైన తెల్లని మేఘాలు కొండల మీద నుంచి ఒక దానిపై నుంచి ఒకటి నీరు ప్రవహిస్తున్నట్లుగా కదులుతున్న వీడియోను ఆయన షేర్​ చేశారు. 
 
అచ్చం జలపాతం లాగా మేఘాలు కిందకు కదిలే ఈ సుందరమైన దృశ్యం మనల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్​లో కనిపించిన ఈ సుందరమైన దృశ్యాన్ని మొదటగా 'ది బెటర్ ఇండియా' తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. 
 
ఆ వీడియోను చూసి ఆకర్షితుడైన గోయెంకా వెంటనే రీట్వీట్ చేశారు. ''కొండ మీద నుంచి కిందకు దూకుతున్న మేఘాలు.. మిజోరాం రాజధాని ఐజ్వాల్​లో కనువిందు చేస్తున్నాయి. మేఘాలు తెలుపు వర్ణాన్ని సంతరించుకొని జలపాతాన్ని తలపిస్తున్నాయి. 
 
ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే మేఘాలు ఇలా మారుతాయి. కొండల నుంచి నీరు ప్రవహిస్తున్నట్లుగా మేఘాలు కదులుతున్నాయి. ఇది చూడటానికి మన రెండు కళ్లు చాలవు. ఇది చాలా అరుదైన సుందరమైన దృశ్యం.'అంటూ కామెంట్​ చేశాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments