Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలిసారి బూస్టర్ డోస్‌పై పరిశోధన.. వలంటీర్లు దొరక్క ఇక్కట్లు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వేరియంట్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వైరస్ భయపెడుతోంది. దీంతో కరోనా బూస్టర్ డోస్ అంశం తెరపైకి వచ్చింది. అయితే, భారత్‌లో బూస్టర్ డోస్ అక్కర్లేదని ఇన్నాళ్లూ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. కానీ, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఇపుడు బూస్టర్ డోస్‌పై అధ్యయనం ప్రారంభమైంది. 
 
ఇందుకోసం దేశంలో తొలిసారి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఈ బూస్టర్ డోస్‌పై అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం మూడు నుంచి ఆరు నెలల కిందట కోవాగ్జిన్ రెండు మోతాదుల టీకా వేయించుకున్న వలంటీర్లు అవసరమయ్యారు. కానీ, కోవాగ్జిన్ తీసుకున్నవారు ఎక్కువ మంది అందుబాటులో లేరు. దీంతో ఈ బూస్టర్ డోస్ ప్రయోగానికి ఆటంకం ఏర్పడుతుంది. 
 
నిజానికి భారత్‌లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అందిస్తున్న వ్యాక్సిన్లలో 88 శాతం వాటా కోవిషీల్డ్‌దే. అందుకే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కోవాగ్జిన్ టీకాలు వేయించుకున్న వారి కోసం ఈ ఇనిస్టిట్యూట్ ఆరా తీస్తుంది. మూడు నుంచి ఆరు నెలల కిందట రెండో డోస్ కోవాగ్జిన్ టీకా తీసున్న వారు ఈ బూస్టర్ డోస్ అధ్యయనానికి అర్హులు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments