సీఎం కేసీఆర్ వస్తారో రారో ఎదురుచూద్దాం: చిన్నజీయర్ స్వామి

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (09:39 IST)
ఫోటో కర్టెసీ-చిన్నజీయర్ ఆర్గ్
సమతా మూర్తి విగ్రహావిష్కరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఆరోగ్యరీత్యా ప్రధాని మోదీని స్వాగతించేందుకు కూడా రాలేకపోతున్నట్లు చెప్పారు. ఆ సంగతి అలా వుంటే.. సమతామూర్తి విగ్రహావిష్కరణ జరిగినప్పటికీ అటువైపు ముఖ్యమంత్రి కేసీఆర్ తొంగిచూడలేదు. దీనితో చిన్నజీయర్ స్వామికి కేసీఆర్‌కి మధ్య విభేదాలున్నట్లు ప్రచారం మొదలైంది.

 
ఈ ప్రచారంపై జీయర్ స్వామి స్పందిస్తూ... తమకు ఎవరితోనూ విభేదాలు వుండవన్నారు. తమకు అందరూ సమానమేనని చెప్పారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ తదనంతర కార్యక్రమాలు విజయవంతం కావడానికి కేసీఆర్ గారే ముఖ్య కారణమని తెలిపారు. ఆయన ఇప్పటివరకూ ఇక్కడికి రాకపోవడానికి వేర్వేరు కారణాలు వుండివుండవచ్చన్నారు. తనకు, కేసీఆర్ గారితో ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పారు. రాజకీయాల్లో స్వపక్షం, విపక్షం వుంటుందని.. తమ దగ్గర కాదని చెప్పారు.

 
కాగా ఈరోజు ముచ్చింతల్‌లో జరుగనున్న శాంతి కళ్యాణానికి కేసీఆర్ వస్తారో రారోనని చిన్నజీయర్ స్వామి అన్నారు. ఆయనను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తామని తమతో చెప్పినట్లు గుర్తు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments