Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని పూర్తి కాలేదో.. మూత్రాన్ని తాగించడం, బొద్దింకను తినిపించడం, టాయిలెట్‌ నీటిని..?

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (18:50 IST)
నిర్ణీత సమయంలో పనిని పూర్తి చేయని కారణంగా ఓ చైనాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు చీదరించుకునే శిక్షలను అమలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ ఇంటీరియర్ డెకరేషన్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలో పనిచేసే ఉద్యోగులు టాయిలెట్ నీటిని తాగాలని కఠినశిక్ష విధించింది.
 
చైనా, కుయిసోహూ ప్రావిన్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ.. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయని ఉద్యోగులకు కఠిన శిక్ష విధిస్తోందని తెలిసింది. ఈ శిక్షలు దారుణంగా వుంటాయని వెల్లడి అయ్యింది. ఇందులో మూత్రాన్ని తాగించడం, ప్రాణాలతో వున్న బొద్దింకను తినేలా చేయడం.. టాయిలెట్ నీటిని తాగించడం వంటి దారుణమైన శిక్షలుంటాయని తేలింది. ఈ శిక్షలను తోటి ఉద్యోగుల ముందు నిలబెట్టి అమలు చేస్తారని.. అప్పుడే నిర్ణీత సమయానికి వారు పనిని పూర్తి చేస్తారని సదరు సంస్థ భావించేదని తెలిసింది.
 
ఈ వ్యవహారం.. ఆ సంస్థ నుంచి తప్పుకున్న ఉద్యోగులు వీడియో రూపంలో బయటపెట్టడం ద్వారా బహిర్గతం అయ్యింది. ఆధారాలతో పాటు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో.. ఆ సదరు సంస్ధకు చెందిన ముగ్గురు మేనేజర్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments