Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వరదలపై హైకోర్టు ఆగ్రహం... నీళ్ల కోసం ఏడ్వాలి.. నీళ్ల కోసం చావాలి...

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (18:19 IST)
చెన్నై నగరంలో సంభవించిన వరదలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నై మహానగరం న‌గ‌రం వ‌ర‌ద‌ల్లో చిక్కుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో కార్పొరేష‌న్ అధికార యంత్రాంగం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ంటూ మండిపడింది. గత 2015 వరదల తర్వాత చెన్నైలో తీసుకున్న చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. 
 
'ఏడాదిలో స‌గం రోజులు మేం నీళ్ల కోసం ఏడ్చేలా చేశారు. మిగిలిన సగం రోజులు మ‌మ్ముల నీళ్ల‌లో చ‌చ్చేలా చేశారు' అని గ్రేటర్ చెన్నై కార్పొరేష‌న్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ప్ర‌తి వ‌ర్షాకాలం న‌గ‌రం నీట మునుగుతున్నా న‌గ‌ర కార్పొరేష‌న్ ఎందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలేద‌ని మొట్టికాయ‌లు వేసింది.
 
2015లో చెన్నై న‌గ‌రాన్ని భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయ‌ని, అది జ‌రిగి ఐదు సంవ‌త్స‌రాలైన గ్రేట‌ర్ చెన్నై కార్పొరేష‌న్‌ వ‌ర‌ద‌ల‌ను నివారించే చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ బెన‌ర్జీ, జ‌స్టిస్ పీడీ ఆదికేశ‌వులు నేతృత్వంలోని ధ‌ర్మాసనం వ్యాఖ్యానించింది. 
 
ఇప్ప‌టికైనా చెన్నైలో వ‌ర‌ద‌లు పోటెత్త‌కుండా న‌గ‌ర కార్పొరేష‌న్ చ‌ర్య‌లు తీసుకోక‌పోతే తాము ఈ కేసును సుమోటోగా స్వీక‌రిస్తామ‌ని న్యాయ‌స్థానం హెచ్చ‌రించింది. కాగా, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం నీట మునిగివున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments