Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ మహాకుట్ర.. పవన్ ఆమరణ దీక్ష... ఆ తర్వాత ప్రత్యేక హోదా : నేతలతో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర స్థాయిలో మహాకుట్ర జరిగినట్టు తనకు స్పష్టమైన సంకేతాలు అందాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (11:20 IST)
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కేంద్ర స్థాయిలో మహాకుట్ర జరిగినట్టు తనకు స్పష్టమైన సంకేతాలు అందాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యంగా, విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. 
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై మాటల దాడిచేయడం, వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం వంటి తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాలన్నింటిపై చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. 
 
కానీ, అది వైకాపా, జనసేన చేసిన నిరసనలు, కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి కారణంగానే ఇస్తున్నట్టు ప్రజలను మభ్య పుచ్చాలన్నది మోడీ ఆలోచనగా ఉంది. హోదా కోసం ఆమరణ దీక్షకు దిగుతానని పవన్ వెల్లడించడాన్ని గుర్తు చేసిన ఆయన, పవన్ దీక్ష తర్వాత విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తున్నామని, ప్రజా సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని ప్రధాని నుంచి ప్రకటన వస్తుందని అంచనా వేశారు. 
 
ఈ మేరకు ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు కేంద్రంలోని పెద్దల నుంచి సూచనలు అందాయని చంద్రబాబు ఆరోపించారు.  కేంద్రం కుట్రలు, ఆడుతున్న డ్రామాలపై ప్రజల్లోకి వెళతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, దీన్ని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని చెప్పడానికి ఇంకన్నా రుజువులు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments