Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం, వారితోనే కలిసి పోటీకి..?

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (23:49 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రస్తుతం హోంమంత్రితో మాట్లాడి ఎపిలో జరుగుతున్నపరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీకి వెళ్ళిన ఆయనకు అపాయింట్మెంట్ దొరక్కపోయినా సరే ఫోన్ ద్వారా అమిత్ షా మాట్లాడడంతో అన్ని విషయాలను వివరించారు. 
 
ఇదంతా ఒకే అయితే ఢిల్లీకి వెళ్ళి బాబు కొన్ని కీలక విషయాలను మీడియాతో చిట్ చాట్ ద్వారా పంచుకున్నాడట. మరో రెండున్నర సంవత్సరాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు.
 
అది కూడా జనసేనతోనేనన్న విషయాన్ని స్పష్టం చేశారట. ఇప్పటికే బిజెపితో దూరంగా ఉంటూ వస్తోంది జనసేన. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఉన్న పరిచయాలతోనే కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారట బాబు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సద్దుమణిగిన తరువాత పొత్తులపై ముందుకు వెళ్ళాలనుకుంటున్నారట చంద్రబాబు.
 
అయితే జనసేనతో పొత్తుకు ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారా.. లేకుంటే టిడిపి నేతలు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. రెండు పార్టీల నేతలు ముఖ్య నేతలు ఒప్పుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. అయినా సరే ఎలాగైనా ఒప్పించి ఖచ్చితంగా ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్ళి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్లాన్లో చంద్రబాబు ఉన్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments