Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ స్పెక్ట్రమ్ వేలానికి పచ్చజెండా ఊపిన కేంద్రం

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (14:56 IST)
దేశంలో ఐదో జనరేషన్ తరంగాల(5జీ) సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 5జీ స్పెక్ట్రమ్స్ వేలానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో 5జీ సేవలు ప్రజలకు వినియోగానికి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. దీంతో జూలై నెలాఖరు నాటికి ఈ 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవల వేగం ప్రస్తుతం ఉన్న వేగానికంటే పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. 
 
దీనిపై కేంద్రం ఓ పత్రికా ప్రకటన చేసింది. "ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రాధాన్యత అంశంగా ఉంది" అని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఇంటర్నెట్, ముబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రజల రోజువారీ జీవితాల్లో ఓ భాగమైపోయాయి. కాగా, దేశంలో గత 2015లో 4సీ సేవలు అందుబాటులోకి రాగా, ఈ సేవలు శరవేగంగా దేశంలో విస్తరించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలను పొందుతున్న వారి సంఖ్య 80 కోట్ల వరకు ఉంమది. 2014లో ఈ సంఖ్య 10 కోట్లుగానే ఉండేదని కేంద్ర టెలికాం శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments