Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీడీఎస్ బిపిన్ రావత్ చివరి క్షణాల్లో ఏం కావాలని అడిగారు...

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:50 IST)
గత బుధవారం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌లు కన్నుమూశారు. అయితే, ఆయన చావుబుతుకుల మధ్య కొట్టాడుతూ చివరిగా మాట్లాడిన మాటలను ఓ ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు కావాలని అడిగారని ప్రత్యేక్ష సాక్షి శివకుమార్ చెబుతున్నారు. 
 
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. అయితే, హెలికాఫ్టర్ పెద్ద శబ్దంతో కూలిపోయిన వెంటనే స్థానికులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. అలాంటివారిలో శివకుమార్ ఒకరు. ఈ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ, ఆ రోజున మధ్యాహ్నం మేం పని చేస్తున్న సమయంలో భారీ శబ్దం వినిపించిది. అపుడు అక్కడకు వెళ్లి చూడగా, చెట్టు కొమ్మలపై ఓ హెలికాఫ్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది. ఆ ప్రదేశంలోని పొదల్లో మాకు ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో కనిపించారు. బహుశా వారిద్దరూ హెలికాప్టర్ నుంచి దూకేసి ఉంటారు. 
 
వాళ్ల వద్దకు వెళ్లి చూస్తే వాళ్ల బట్టలు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. వారిలో ఒకరు దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనకు ఏం కాదని ధైర్యం చెప్పి, తప్పకుండా సాయం చేస్తామని చెప్పాం. ఆ తర్వాత ఒక దుప్పటి సాయంతో వాళ్లను ముళ్ళ పొదల్లో నుంచి బయటుకు తీసుకొచ్చాం. అపుడే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆయన్ను మేం ఎవరో సాధారణ వ్యక్తి అనుకున్నాం. కానీ, నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ బిపిన్ రావత్ అని కొంతమంది మంది చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అపుడే తెలుసుకున్నాను అని ఘటన జరిగిన తీరును శివకుమార్ వివరించారు. 
 
ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడిన గొప్పవ్యక్తి.. ఆఖరి క్షణాల్లో మంచినీళ్లు అడిగనా ఇవ్వలేక పోయామని శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీలో నిర్వించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments