Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమి గర్భవతా? అందుకే ఆస్పత్రికి వెళ్లిందా?

నరసాపురానికి చెందిన గౌతమి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొలుత రహదారి ప్రమాద కేసుగా పోలీసులు తేల్చగా సీబీసీఐడీ దర్యాప్తుతో తిరిగి హత్యగా నమోదు చేశారు.

Webdunia
గురువారం, 5 జులై 2018 (12:33 IST)
నరసాపురానికి చెందిన గౌతమి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొలుత రహదారి ప్రమాద కేసుగా పోలీసులు తేల్చగా సీబీసీఐడీ దర్యాప్తుతో తిరిగి హత్యగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకొని అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు.
 
పాలకొల్లు గ్రామీణ సీఐ కె.రజనీకుమార్‌ నరసాపురంలో విచారణ జరిపారు. మృతురాలు గౌతమి చెల్లెలు పావని, తల్లి అనంతలక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్లి సజ్జా బుజ్జి, గౌతమిల వివాహం గురించి ఆరా తీశారు. వివాహం ఎక్కడ జరిగిందనే కోణంలో ఆరా తీయడంతో పాటు పెళ్లికి సంబంధించిన ఛాయా చిత్రాలను సేకరించారు. వీటిని బట్టి వివాహం ఒక ఇంట్లో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆ ఇల్లు ఎవరిదై ఉంటుందనే కోణంలో విచారిస్తున్నారు. 
 
అదేసమయంలో ప్రమాదం జరిగిన రోజున గౌతమి పాలకొల్లు ఆసుపత్రికి దేనికి వెళ్లిందన్న విషయాన్ని తెలుసుకుని సంబంధించిన రిపోర్టులను తీసుకొన్నారు. ఆ తర్వాత ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లి అక్కడ విచారణ జరిపారు. నరసాపురం పట్టణంలో కెనరా బ్యాంకులో నిందితులకు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీశారు. ఈ కేసుకు సంబంధించి అన్నవరం, కానూరు, మార్టేరు, దర్బరేవు, నవరసపురం తదితర ప్రాంతాల్లోను విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. 
 
అరెస్టుకు రంగం సిద్ధం హత్య కేసులో నిందితులైన ఏడుగురిలో నలుగురు ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే. మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసేందుకు పోలీసులు అడుగులేస్తున్నారు. దీనిలో భాగంగా ఘటన జరిగిన రోజున గౌతమి, పావనిలను గుర్తించేలా ప్రమాదం చేసిన వాహనదారులకు సమాచారమిచ్చిన నరసాపురానికి చెందిన రమేష్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొనే అవకాశవుంది. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments