భారతీయులకు బ్రెజిల్ బెస్ట్ ఆఫర్... ఏంటది?

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (19:29 IST)
భారతీయులకు బ్రెజిల్ ఓ బెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎలాంటి వీసా సౌకర్యం లేకుండానే తమ దేశాన్ని భారతీయులు సందర్శించవచ్చని ఆ దేశ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో తెలిపారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉంటూ ఈ ప్రకటన చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల పౌరులకు కూడా బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించిందని గుర్తుచేశారు. తాజాగా, భారత్‌తో పాటు చైనాను కూడా ఆయన ఈ జాబితాలో చేర్చినట్టు చెప్పారు. 
 
అయితే, పైన పేర్కొన్న ఏ ఒక్క దేశం కూడా బ్రెజిల్‌ పౌరులకు వీసా లేకుండా తమతమ దేశాలకు వచ్చే అవకాశాన్ని కల్పించలేదు. ఆయా దేశాల పర్యాటకులు, వ్యాపారులు వీసా లేకుండానే బ్రిజిల్ వెళ్లవచ్చు. 
 
జేర్‌ బోల్సొనారో గతేడాది బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పలుసార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే, అమెజాన్ కార్చిచ్చు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎన్‌జీవోల వల్లేనంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments