Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (09:15 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2002లో జలగాంలో పెళ్లి చేసుకున్న ఓ జంట 2016 నుంచి విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో విడాకుల కోసం వారు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ రీత్యా మహిళ అమెరికాలో ఉండడంతో ఆమె కోర్టుకు హాజరు కావడం వీలుకాలేదని ఆమె తరపు న్యాయవాది సమీర్ వైద్య చెప్పారు. ఇంకా పిటిషన్‌‍ను కోర్టు కొట్టివేయడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments