Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి గంటాగారి దారి తెలిసింది.. నాడు 'అన్నయ్య'.. నేడు 'తమ్ముడు' పార్టీలోకి...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అలకపాన్పునెక్కారు. భీమిలి నియోజకవర్గంలో ఏర్పడిన చిచ్చు చివరకు ఆయన పార్టీ మారాలన్న స్థాయికి తీసుకొచ్చింది. ఫలితంగా అమరావతి వేదికగా జరిగిన రాష్ట్

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (08:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అలకపాన్పునెక్కారు. భీమిలి నియోజకవర్గంలో ఏర్పడిన చిచ్చు చివరకు ఆయన పార్టీ మారాలన్న స్థాయికి తీసుకొచ్చింది. ఫలితంగా అమరావతి వేదికగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా గంటా డుమ్మా కొట్టారు. దీంతో ఆయన పార్టీ మారడం తథ్యమని తేలింది. అయితే, ఈ పార్టీలోకి వెళతారన్నదే ఇపుడు సందేహాస్పదంగా మారింది.
 
ఈ పరిస్థితుల్లో ఆయన గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. గంటా శ్రీనివాసరావు త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. టీడీపీ తనని కావాలనే పరోక్షంగా దూరం పెట్టాలని చూస్తుందని భావించిన గంటా, టీడీపీ మీద అసహనంతో జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. 
 
గంటాకి ప్రజల నాడి అంచనా వేయడం, రాజకీయ పార్టీలు మారడం కొత్తేమి కాదు. టీడీపీ తరుపున ఎంపీగా చేసిన గంటా, తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత మంత్రిగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చి ప్రస్తుతం మంత్రిగా చేస్తున్నారు. అయితే, రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో దిట్ట అయిన గంటా, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలిలో జనసేన మూలంగా తను ఓడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి, జనసేన తరుపున పోటీ చేసి మళ్ళీ గెలవాలని భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
 
ఇదీ భీమిలి చిచ్చు కథ... 
 
అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్  సమావేశానికి సీనియర్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు గైర్హాజరయ్యారు. ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నంలోనే  గంటా శ్రీనివాస్ ఉండిపోయారు. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. భీమిలి సీటు విషయంలో గంటా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. భీమిలి నుంచే ఈసారి పోటీ చేస్తానని ఇప్పటికే గంటా శ్రీనివాస్ ప్రకటించారు. అయితే భీమిలి సీటు అవంతి శ్రీనివాస్‌కు ఇస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటా మనస్తాపం చెందారు.
 
భీమిలి నుంచి గంటా పోటీచేస్తే గెలవలేడనే పార్టీ ఇచ్చిన నివేదికలపై గంటా మనస్థాపం చెందారు. తాజా సర్వే పేరుతో తనను అప్రతిష్టకి గురి చేసేలా, సొంత నియోజకవర్గంలో తనకు వ్యతిరేకత ఉందనేలా ప్రచారం జరగటానికి పార్టీయే ఆస్కారమిచ్చినట్లు మంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. విశాఖపట్నం భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అందులో తన పాత్ర లేనట్లు తేలినా... దాన్ని బయటపెట్టకపోవటం కూడా తనను ఇబ్బంది పెట్టేందుకేనన్నట్లుగా ఆయన సందేహిస్తున్నారని చెబుతున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళుతున్నారు. నగరంలో పట్టాల పంపిణీతో పాటు మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గమైన భీమిలిలో ఏర్పాటు చేసిన రెండు కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వీటికి హాజరవాలా... వద్దా అన్న దానిపైనా మంత్రి తర్జనభర్జన పడుతున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం. అయితే జిల్లాలో 21న జరిగే సీఎం పర్యటన కారణంగానే గంటా కేబినెట్‌కు రాలేదని పార్టీ వర్గాలు, ప్రభుత్వం చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments