ఎల్‌కే అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం: నరేంద్ర మోడీ అభినందనలు

ఐవీఆర్
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (12:02 IST)
కర్టెసి-ట్విట్టర్
భాజపా కురువృద్దులు, సీనియర్ నాయకులు, ఆ పార్టీకి వెన్నెముక అయిన ఎల్.కె. అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
 
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో... శ్రీ ఎల్‌కే అద్వానీజీకి భారతరత్న ఇవ్వబడుతుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. నేటి రాజకీయ వ్యవస్థలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.
 
అట్టడుగు స్థాయి నుంచి పని చేస్తూ మన దేశ ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం ఆచరణీయం. ఆయన మన హోం మంత్రిగా, I&B మంత్రిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన పార్లమెంటరీ విధానాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప అంతర్దృష్టులతో నిండి ఉన్నాయి." అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments