భారత్ బంద్ : దేశవ్యాప్తంగా ఎఫెక్టు - కేరళలో తీవ్రం.. నిలిచిన బ్యాంకు సేవలు

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:19 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మెకు దిగాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రజా రవాణాతో పాటు బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఇప్పటికే శబరిమల వివాదంతో అట్టుడికిపోతున్న కేరళ రాష్ట్రంలో ఈ బంద్ ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
ఈ బంద్‌లో ఐఎన్‌టీయూసీ ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూతో పాటు 10కి పైగా కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు అంతరాయం ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వామపక్ష ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాల్లో బంద్ ఉధృతంగా సాగుతోంది. 
 
సర్కారీ కొలువుల్లో కనిష్ట వేతనం రూ.18 వేలుగా నిర్ణయించాలని, పబ్లిక్ రంగ షేర్లను విక్రయించడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారత్ బంద్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో ప్రజాసేవలన్నీ స్తంభించిపోయాయి. ఆందోళనకారులు రోడ్లను బ్లాక్ చేసి, బస్సు సర్వీసులను అడ్డుకుంటున్నారు. అలాగే, రైళ్ళు కూడా నడవకుండా రైల్ రోకోలకు దిగారు. సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌కు చెందిన 20 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments