Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రానని చెప్పకుండానే ఎనౌన్స్ చేశారు, ఇండస్ట్రీ ఆ ఒక్క వ్యక్తిదేనా? చిరుపై బాలయ్య ఇండైరెక్ట్ ఎటాక్

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (09:54 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరు వర్సెస్ బాలయ్య వ్యవహారం ముదిరిపోతోంది. సినిమా షూటింగులకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి తదితరులు కలిసినప్పుడు, ఆ సమావేశానికి తనను ఆహ్వానించలేదని మండిపడ్డారు బాలయ్య. ఆ తర్వాత వాళ్లందరూ భూములు పంచుకోవడానికి వెళ్లారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కుదుపుకు గురైంది.
 
ఇక ఏపీలోనూ సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ టాలీవుడ్ సెలబ్రిటీలు నిన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గతంలో సీఎం కేసీఆర్ వద్దకు ఎవరెవరు వెళ్లారో వారే హాజరయ్యారు. ఈ సమావేశానికి బాలయ్యను ఆహ్వానించినా తన పుట్టినరోజు వేడుకల్లో బిజీ వల్ల ఆయన రాలేకపోతున్నారంటూ నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు.
 
దీనిపై తాజాగా బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ముఖ్యమంత్రిని కలవాలని ఎవరు డిసైడ్ చేస్తారు. సినిమా చాంబరా లేదంటే ఒక వ్యక్తా? ఎవరో ఒక వ్యక్తి పేరు మీద సీఎం అపాయింట్మెంట్ ఇస్తే దానికి నేను వెళ్లాళా? ఈ విషయంపై తనతో సంప్రదించినప్పుడు ఆలోచిస్తానని చెప్పాను కానీ రానని చెప్పలేదు.
 
ఇంతోలోనే నేను రానన్నానంటూ మీడియాలో ప్రకటించేశారు. నేను చెప్పకుండా నా ప్రకటనగా వారెలా చెప్తారు. ఏదైనా ఫిలిమ్ ఛాంబర్ నిర్ణయిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం కానీ ఎవరో ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తామా అంటూ ప్రశ్నించారు. మరి దీనిపై చిరు-నాగ్ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments