Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కరోనా సోకి తొలి ప్రజా ప్రతినిధి అన్భళగన్ మృతి

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (09:51 IST)
Anbazhagan
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తున్న కరోనా వైరస్ కారణంగా లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా కరోనా వైరస్ సామాన్య ప్రజలను కాకుండా అన్నీ వర్గాల ప్రజలను కబళిస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ ప్రజా ప్రతినిధి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జే అన్భళగన్ (61) కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. 
 
కొన్ని రోజులుగా ఆయన కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ని మంగళవారం ఆస్పత్రిలో చేర్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలోల చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
తద్వారా భారత్‌లో కరోనా వైరస్ సోకి మరణించిన తొలి ప్రజా ప్రతినిధి ఆయనే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇక అన్భళగన్ మృతి పట్ల డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments