Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక హైడ్రామా.. రాజీనామా చేసిన యడ్యూరప్ప.. శ్రీరాములు కూడా...

కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం

Webdunia
శనివారం, 19 మే 2018 (12:30 IST)
కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశమైంది.
 
ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు సైతం ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. 
 
వీరిద్దరి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం ఆమోదించారు. యడ్యూరప్ప షిమోగ లోక్‌సభ స్థానం నుంచి, శ్రీరాములు బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 
 
కాగా, ఈనెల 15వ తేదీన వెల్లడైన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులకు 2 సీట్లు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments