కర్ణాటక హైడ్రామా.. రాజీనామా చేసిన యడ్యూరప్ప.. శ్రీరాములు కూడా...

కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం

Webdunia
శనివారం, 19 మే 2018 (12:30 IST)
కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశమైంది.
 
ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు సైతం ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. 
 
వీరిద్దరి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం ఆమోదించారు. యడ్యూరప్ప షిమోగ లోక్‌సభ స్థానం నుంచి, శ్రీరాములు బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 
 
కాగా, ఈనెల 15వ తేదీన వెల్లడైన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులకు 2 సీట్లు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments