Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రిపదవులకు గజపతిరాజు - సుజనా చౌదరీలు రాజీనామా

కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (18:13 IST)
కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.
 
నిజానికి వారిద్దరూ బుధవారం రాత్రే రాజీనామా చేయాల్సి వుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో లేకపోవడంతో వారు రాజీనామా చేయలేదు. ఆ తర్వాత గురువారం ఉదయం ప్రధాని మోడీ రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు.
 
అక్కడ నుంచి తిరిగివచ్చాక గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో వీరిద్దరూ ప్రధాని మోడీని కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తాము ఏయే కార‌ణాల వ‌ల్ల కేంద్ర మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నామో మోడీకి వివరించారు. 
 
కాగా, టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన అశోకగజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ విమానాల్లో ప్రయాణించేందుకు అవసరమైన బోర్డింగ్ పాస్‌లు తీసుకునేటపుడు, విమానం ఎక్కేటపుడు ఒక సాధారణ పౌరుడిలా నడుచుకునేవారు. అలాగే, మరో సీనియర్ నేత వైవీఎస్ చౌదరి (సుజనా చౌదరి) కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments