Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి గుడ్‌బై

భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే వెంకటేష్ ప్రసాద్

జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి గుడ్‌బై
, శనివారం, 3 మార్చి 2018 (10:16 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే వెంకటేష్ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించారు.
 
ఈ వ్యవహారంపై బీసీసీఐ స్పందించింది. క్రికెట్‌కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్‌మెంట్‌ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... భార్యను చూసి జడుసుకున్నా: విరాట్ కోహ్లీ