Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు - కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామంటున్న సీఎం సన్

తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు.

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (16:56 IST)
తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీటి ట్యాంకర్లలో అవినీతి జరుగుతోందని బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. 
 
అలాగే తన శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం లేదన్నారు. తన కుటుంబం పాలు, కూరగాయలు అమ్మి డబ్బు సంపాదిస్తోందని.. చివరికి తన క్రెడిట్‌ కార్డు బిల్లు కూడా వారే కడతారని చెప్పారు. తన శాఖలో అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలకు నింబంధనల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments