Webdunia - Bharat's app for daily news and videos

Install App

బామ్మ ఇడ్లీ షాపుపై మనసుపడిన ఆనంద్ మహీంద్రా.. (video)

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (13:37 IST)
ఆనంద్ మహీంద్రా.. దేశంలో ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. మహీంద్రా గ్రూపు అధినేత. అయితే, ఈయన సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆసక్తికరమైన అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. 
 
తాజాగా కోయంబత్తూరులో నిస్వార్థంగా ఒక్క రూపాయికే ఇడ్లీలు అమ్ముతూ పేదోడి ఆకలి తీరుస్తూ సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్. ఈమె నడుపుతున్న ఇడ్లీ షాపు గురించిన వార్త ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఆనంద్ మహీంద్రా కంటపడింది. 
 
అంతే.... ఆయన బామ్మ కమలాథల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది.
 
కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టౌవ్‌ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా' అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో పంపారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments